83 పరుగులకే ఐదు వికెట్లు
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన తైజుల్ ఇష్లాం 39 పరుగులతో నాటౌట్గా రాణించడంతో 36 ఓవర్లకు గాను 172 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో దాసన్ షణక మూడు వికెట్లు పడగొట్టాడు.
కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శన
ఈ సిరీస్లో కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కుశాల్ మెండిస్ బైక్పై జట్టులోని సహచర ఆటగాడిని ఎక్కించుకుని స్టేడియంలో చక్కర్లు కొట్టాడు.
బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది
ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, జట్టు సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బైక్ను పైకి లేపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
|
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, మూడో వన్డే విజయాన్ని శ్రీలంక నువాన్ కులశేఖరకు అంకితం చేసింది. కాగా, బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేతో శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.