
కోహ్లీపై కెప్టెన్సీపై ప్రభావం
ఈ ఓటమి టీమిండియా విరాట్ కోహ్లీపై కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపింది. ఇందులో భాగంగా బీసీసీఐ సైతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు ఒక కెప్టెన్, సుదీర్ఘ ఫార్మాట్కు మరొక కెప్టెన్ను నియమించాలని భావిస్తోంది. ఇందుకు ఉదహరణగా ఇంగ్లాండ్ జట్టుని చూపిస్తున్నారు.

ఇంగ్లాండ్ ఆదర్శం
2015 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేసింది. అయితే, ఆ తర్వాత ఆ జట్టులో చేసిన సమూల మార్పులే 2019లో ప్రపంచకప్ను గెలిచేలా చేశాయని బోర్డు సైతం భావిస్తోంది. ఇందులో భాగంగా టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్గా విరాట్ కోహ్లీ... వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించాలని చూస్తోంది.

కెప్టెన్గా రోహిత్ శర్మ
ఈ మేరకు బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "50 ఓవర్ల ఫార్మాట్కు రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయం. జట్టు మేనేజ్మెంట్తో పాటు ప్రస్తుత కెప్టెన్ ఇందుకు సానుకూలంగానే ఉన్నారు. వచ్చే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం సరైందే" అని అన్నారు.

రోహిత్ శర్మనే సరైన వ్యక్తి
"మన అందరికీ తెలుసు, కొన్ని ఏరియాల్లో పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆ జాబ్కు రోహిత్ శర్మనే సరైన వ్యక్తి" అని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రపంచకప్లో టీమిండియా ప్రదర్శనపై త్వరలోనే రివ్యూ మీటింగ్ ఉంటుందని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.

త్వరలో రివ్యూ మీటింగ్
ఆ మీటింగ్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేసే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తన ట్విట్టర్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2023 వరల్డ్కప్ ఆడాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












