న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి రోజు 13 వికెట్లు: ఆసక్తికరంగా కర్ణాటక-విదర్భ రంజీ మ్యాచ్

By Nageshwara Rao
Karnataka-Vidarbha semi hangs in balance

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కర్ణాటక-విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంది. ఇరు జట్లకు చెందిన పేసర్లు రాణించడంతో తొలిరోజు 13 వికెట్లు కూలాయి. కర్ణాటక పేస్ బౌలర్ అభిమన్యు మిథున్ (5/45) తో రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో విదర్భ టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆదిత్య సర్వతే (47) జాఫర్ (39) సతీష్ (31) కాస్త ఫరవాలేదనిపించారు. అభిమన్యు మిథున్ (5/45) తో రాణించగా, అతనితో పాటు కెప్టెన్‌ వినయ్‌కుమార్‌ (2/36) విజృంభించడంతో తక్కువ స్కోరుకే విదర్భ ఆలౌటైంది.

అనంతం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కర్ణాటక తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. విదర్భ బౌలర్లలో గుర్బానీ 2 వికెట్లు తీయగా.. ఉమేశ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక పుణెలో ఢిల్లీతో జరుగుతున్న సెమీస్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 9:40 [IST]
Other articles published on Dec 18, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X