పాండ్యా-రాహుల్పై విమర్శలు
యువతకి ఆదర్శంగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా అసభ్యకరంగా మాట్లాడటంతో వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో వీరిద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన బీసీసీఐ విచారణకు ఆదేశించింది. దీంతో తాజాగా ఈ మొత్తం వివాదానికి కారకుడైన కరణ్ జోహార్ స్పందించాడు.
నా పరిధిలో లేదు
"నా షోకి వచ్చే సెలబ్రిటీలందరికీ సాధారణంగా అలాంటి ప్రశ్నలే వేస్తుంటాను. అందులో దీపికా పదుకొణె, అలియా భట్ తదితర హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే, ఆ ప్రశ్నలకి వారు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది మాత్రం నా పరిధిలో లేని అంశం. కానీ.. వాళ్లు నా షోలో ఉన్నారు, కాబట్టి దానికి బాధ్యుడిని నేనే. వాళ్లను నేనే అతిథులుగా ఆహ్వానించాను" అని చెప్పుకొచ్చాడు.
నేనే బాధ్యత వహించాలి
"ఆ షోలో ఏం జరిగినా నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్లకు జరిగిన నష్టం చూసి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలా అని ఆలోచించాను. కానీ నా మాట వినేవాళ్లు ఎవరు? ఇప్పుడు ఈ హార్దిక్, రాహుల్ వివాదం నా పరిధిలో లేదు" అని కరణ్ జోహార్ వెల్లడించాడు. పాండ్యా-రాహుల్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ ఎపిసోడ్ని ఇంటర్నెట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.