పేస్ బలాల్ని అర్థం చేసుకుని
తాజాగా కపిల్ దేవ్ మాట్లాడుతూ... 'మన ఫాస్ట్ బౌలర్లకు ఆసీస్ పిచ్లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. అక్కడ ఎక్కువగా ఆడిన ఇషాంత్ శర్మ దూరమయ్యాడు. అక్కడ బౌన్స్ లభిస్తుందని షార్ట్ బంతులు విసరడానికి మన బౌలర్లు ప్రయత్నిస్తుంటారు. అయితే మన పేస్ బలాల్ని అర్థం చేసుకుని బౌలింగ్ చేయాలి. మనకి ప్రస్తుతం ఉత్తమ బౌలింగ్ దళం ఉంది. కానీ మన బౌలర్ల కంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకి అక్కడి పరిస్థితులపై ఎంతో అవగాహన ఉంది. వారు ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు' అని అన్నారు.
ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న తొలి డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియాకే విజయావకశాలు ఎక్కువగా ఉన్నాయని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. 'కచ్చితంగా ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు స్వదేశంలో ఆడుతున్నారు. అదే భారత్లో ఆడితే టీమిండియా 80 శాతం విజయం సాధిస్తుందని కచ్చితంగా భావిస్తా. అంతేగాక ఆస్ట్రేలియా ఎన్నో డే/నైట్ టెస్టులు ఆడింది. ఫ్లడ్లైట్ల వెలుతురులో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు' అని టీమిండియా మాజీ సారథి పేర్కొన్నారు.
తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం
1983లో ప్రపంచకప్ను ముద్దాడటం కంటే దేశం తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించడమే తన జీవితంలో గొప్ప విషయమని కపిల్ దేవ్ అన్నారు. 'దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం. ప్రపంచకప్ను అందుకున్న క్షణాల కంటే వెయ్యి రెట్లు గొప్పది. ఎందుకంటే దేశం కోసం ఆడాలనేది నా కల. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎంతో గర్వపడతా' అని కపిల్ చెప్పుకొచ్చారు. 1978లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్తో అరంగేట్రం చేసిన కపిల్ దేవ్ 1983లో దేశానికి తొలి ప్రపంచకప్ను అందించారు. మెగా టోర్నీలో అండర్డాగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. ట్రోఫీని అందుకోవడంలో సారథిగా, ఆల్రౌండర్గా కపిల్ కీలకపాత్ర పోషించారు.
టోక్యో ఒలింపిక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జపనీయులు!!