ద్వైపాక్షిక సిరీస్..
ఈ నెల 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ ఉంటాయి. 13వ తేదీన ఫైనల్తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. దీని తరువాత అన్ని జట్లు కూడా ద్వైపాక్షిక సిరీస్లకు సన్నద్ధమౌతాయి. ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత్ క్రికెట్ జట్టు అటు నుంచి అటే న్యూజిలాండ్కు బయలుదేరి వెళ్తుంది. మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఈ నెల 18వ తేదీన ఈ సిరీస్ ఆరంభమౌతుంది. నెలాఖరున ముగుస్తుంది.
ఆక్షన్ కోసం..
అదే సమయంలో ఐపీఎల్ 2023 మినీ వేలంపాటకు సంబంధించిన సందడి ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్లో అన్ని ఫ్రాంఛైజీలు ఆక్షన్ను నిర్వహించవచ్చు. ఈ నెల 15వ తేదీ నాటికే- ఐపీఎల్లో ఆడే 10 ఫ్రాంఛైజీలు తమ జట్టు ప్లేయర్ల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రస్తుతం అన్ని జట్లు కూడా కసరత్తు చేస్తోన్నాయి. అట్టిపెట్టుకునే ప్లేయర్లు, రిలీజ్ చేయదలిచిన వారి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేస్తోన్నాయి.
సీఎస్కేలో భారీ మార్పులు..
ఐపీఎల్లో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ లిస్ట్ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే జట్టులో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచనల మేరకు తుది జట్టులో ఈ సవరణలను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ చేపట్టినట్లు సమాచారం.
రవీంద్ర జడేజా కంటిన్యూ..
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అట్టి పెట్టుకోవడానికే ధోనీ మొగ్గు చూపారు. అతన్ని రిలీజ్ చేయడానికి గానీ లైక్ టు లైక్ రీప్లేస్ చేయడానికి గానీ ధోనీ అంగీకరించలేదు. రవీంద్ర జడేజా తరహాలోనే బ్యాటింగ్, బౌలింగ్లో రాణించే సత్తా ఉన్న టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవాలని మొదట చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ భావించినప్పటికీ- దీనికి ధోనీ ఒప్పుకోలేదని తెలుస్తోంది.
వారిద్దరూ అవుట్..
అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్లో కొనసాగుతూ వస్తోన్న పేస్ బౌలర్ క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నెలను రిలీజ్ చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. వారిద్దరూ ఫామ్లో ఉండట్లేదు. మిల్నె కొంతకాలంగా గాయాలతో సతమతమౌతోన్నాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ క్రిస్ జోర్డాన్ పెద్దగా ఫామ్లో ఉండట్లేదని, అతని స్థానం మరొకరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు భారత ప్లేయర్లను కూడా సీఎస్కే రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు.