న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్‌లతో మాట్లాడా.. ఇక స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు (వీడియో): కోహ్లీ

IPL 2020 : Kohli Message To RCB Fans Ahead Of IPL Auction ! || Oneindia Telugu
IPL 2020 Auction: Virat Kohli says We are going to build a very strong RCB team

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్‌ వేదికగా అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు. 13వ ఐపీల్‌ సీజన్‌లో బెంగళూరు ప్రాంచైజీ స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు అని కోహ్లీ తెలిపాడు. ఈ నెల 19న జరగనున్న వేలంలో బెంగళూరు జట్టు ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను ఎంచుకుంటుంది. అన్ని విభాగాల్లో సమతుల్యం ఉన్న ఆటగాళ్లను ప్రాంచైజీ తీసుకోబోతున‍్నట్లు పేర్కొన్నాడు.

<strong>ఐపీఎల్ వేలంలో 48 ఏళ్ల వెటరన్ క్రికెటర్.. 14 ఏళ్ల కుర్రాడు!!</strong>ఐపీఎల్ వేలంలో 48 ఏళ్ల వెటరన్ క్రికెటర్.. 14 ఏళ్ల కుర్రాడు!!

మీ అభిమానం మరువలేనిది:

మీ అభిమానం మరువలేనిది:

వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'బెంగళూరు అభిమానులకు హాయ్. ఇన్ని సంవత్సరాలుగా మీరు మమల్ని ఎంతో ఆదరించారు. ఇకపై కూడా ఇదే అభిమానాన్ని చూపిస్తూ.. మాకు అండగా ఉంటారని నమ్ముతున్నా. త్వరలో ఐపీఎల్‌-13 వేలం జరగనుందని అందరి తెలిసిందే. వేలంలోకి రానున్న ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి మా జట్టు యాజమాన్యంతో ఇప్పటికే చర్చలు జరిపా. కోచ్‌లు మైక్‌ హస్సీ, సైమన్‌ కటిచ్‌లు తమ శక్తి మేర కష్టపడుతున్నారు' అని తెలిపాడు.

స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు

స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు

'జట్టు యాజమాన్యంతో ఇప్పటికే వేలంకు సంబంధించి సంప్రదింపులు జరిపాం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. వేలంలో అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే సీజన్‌లో స్ట్రాంగ్ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ను చూడబోతున్నారు. డిసెంబర్ 19న ఏం జరుగుతుందో చూద్దాం' అని కోహ్లీ వీడియోలో అన్నాడు.

ఒక్క టైటిల్ గెలవలేదు:

ఒక్క టైటిల్ గెలవలేదు:

ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం నుంచి ఒక్క టైటిల్ కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్‌ సీజన్లలో మూడు సార్లు 2009, 2011, 2016 లో రన్నరఫ్‌తో సరిపెట్టుకుంది. ఇక మిగతా తొమ్మిది సీజన్లలో పేలవ ఆటతీరును కనబర్చింది. 2016 తర్వాత జరిగిన మూడు సీజన్లలో అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.

వేలంలో స్టార్ ఆటగాళ్లు

డిసెంబర్‌ 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఈసారి బెంగుళూరు 13 ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లున్నారు. మిగతా 12 స్థానాలకు ఆటగాళ్ల ఎంపిక కోసం రూ. 27.90 కోట్లతో వేలంలోకి దిగనుంది. స్టార్‌ ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఇయాన్‌ మోర్గాన్‌, పాట్ కమిన్స్‌, క్రిస్‌ మోరిస్‌, రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌లిన్‌, ఆరోన్‌ ఫించ్‌, జేసన్‌ రాయ్‌ వేలంలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లను తీసుకున్నా బెంగళూరు రాత మారనుంది.

Story first published: Wednesday, December 18, 2019, 11:14 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X