ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను
ఈ ధరకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఐపీఎల్ 2019 సీజన్లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వద్ద రూ. 7.15 కోట్లు నగదు ఉంది.
2008 ఆరంభ సీజన్లో టైటిల్ విజేతగా
2008 ఆరంభ సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఐపిఎల్ బదిలీ తేదీ ముగిసిన తర్వాత రాజస్థాన్ ఫ్రాంచైజి మరి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో స్టువర్ట్ బిన్నీ, లియామ్ లివింగ్ స్టోన్, అష్టన్ టర్నర్, జయదేవ్ ఉనాడ్కట్లు ఉన్నారు.
వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్కు ట్రెంట్ బౌల్ట్
ఐపీఎల్ జట్లు ట్రేడింగ్ విండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇతర జట్లలో తమకు నచ్చిన ఆటగాళ్లను తీసుకొనేందుకు బేరసారాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా న్యూజిలాండ్ ఎడమచేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై యాజమాన్యం ట్రేడింగ్ ద్వారా ఒప్పందం చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్కు అంకిత్ రాజ్పుత్
2014లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ట్రెంట్ బౌల్ట్ 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో మొత్తం 33 మ్యాచ్లు ఆడిన ట్రెంట్ బౌల్ట్ 38 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వచ్చే సీజన్లో అంకిత్ రాజ్పుత్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. ఈ మేరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆ జట్టు యాజమాన్యంతో ట్రేడింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.