131 పరుగులు చేసిన చెన్నై
వివరాల్లోకి వెళితే... టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్కి 132 పరుగుల విజయ లక్ష్యం
దీంతో ముంబై ఇండియన్స్కి 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని అలవోక విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్లో విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ అటు బౌలింగ్లోనూ పేలవ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఫీల్డింగ్లో చెన్నై ఫీల్డర్లు అనవసర తప్పిదాలకు పాల్పడ్డారు.
సూర్యకుమార్ యాదవ్ను తక్కువ స్కోరుకే
132 పరుగుల లక్ష్యఛేదనలో చెలరేగిఆడిన సూర్యకుమార్ యాదవ్ను తక్కువ స్కోరుకే ఔట్ చేసే అవకాశం చెన్నైకి వచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
— Vinay Tripathi (@VinayTr85616518) May 7, 2019 |
దీపక్ చాహర్ బౌలింగ్లో
దీపక్ చాహర్ బౌలింగ్లో సూర్యకుమార్ బంతి మిడ్ వికెట్ మీదగా బంతి గాల్లోకి లేచింది. ఈ బంతిని అందుకునే ప్రయత్నం చేసినప్పటికీ మురళీ విజయ్ క్యాచ్ పట్టలేకపోయాడు. ఈ క్యాచ్ను మురళీ విజయ్ పట్టుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కీలకమైన దశలో క్యాచ్లో వదిలేసిన మురళీ విజయ్పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ధోని ఆగ్రహం
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్కు చేరింది. మరోవైపు ఈ మ్యాచ్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్లో తలపడనుంది.