సోమర్సెట్ రికార్డు బద్దలు కొట్టిన ముంబై ఇండియన్స్
ఈ క్రమంలో ఇప్పటివరకు సోమర్సెట్(199 మ్యాచ్లు) పేరిట ఉన్న ఈ రికార్డుని ముంబై ఇండియన్స్ బద్దలు కొట్టింది. ఐపీఎల్లో 200 మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాత సోమర్సెట్(199), హంప్షైర్(194), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(188), ససెక్స్(187), కోల్కతా నైట్రైడర్స్(187)లు ఉన్నాయి.
టీ20 చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్లు:
200 Mumbai Indians *
199 Somerset
194 Hampshire
188 Royal Challengers Bengaluru
187 Sussex/ Kolkata Knight Riders
|
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత మ్యాచ్కి దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఈ మ్యాచ్లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయంతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ స్థానంలో లివింగ్ స్టోన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా... కృష్ణప్ప గౌతం కూడా తిరిగి జట్టులో చేరాడు.
|
మూడో స్థానంలో ముంబై ఇండియన్స్
ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓటమిపాలై పాయింట్ల పట్టకలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.