ఢిల్లీకి కొత్త లోగో
తమ ఫ్రాంచైజీ పేరును, లోగోను మారుస్తున్నట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును ‘ఢిల్లీ క్యాపిటల్స్'గా మారుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ తన అధికారిక ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కొత్త పేరుతో ఉన్న ఫ్రాంచైజీ లోగోను ప్రాంచైజీ నిర్వాహకులు ఆవిష్కరించారు.
|
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనేక మార్పులు
ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గత సీజన్ వేలంలో ఢిల్లీ గూటికి చేరిన గౌతమ్ గంభీర్ సీజన్లో జట్టు పరాజయాలకు భాద్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
|
ఆటగాళ్ల బదిలీలో ఢిల్లీకి ధావన్
దీంతో పాటు ఆటగాళ్ల బదిలీలో భాగంగా ఈ ఏడాది సన్రైజర్స్ జట్టులో ఓపెనర్గా ఉన్న శిఖర్ ధావన్ను ఢిల్లీ ప్రాంఛైజీ సొంతం చేసుకుంది. అంతేకాదు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఢిల్లీ కోచింగ్ స్టాఫ్లో చేరాడు. తాజాగా ఫ్రాంచైజీ పేరును మారుస్తూ.. ఢిల్లీ యాజమాన్యం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
|
ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కిరణ్ కుమార్ గాంధీ మాట్లాడుతూ
ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్, ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కిరణ్ కుమార్ గాంధీ మాట్లాడుతూ "ఇప్పటివరకూ తమ జట్టు ఎంతో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చిందని, వాళ్లంతా ఇప్పుడు జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన చేస్తున్నారు" అని అన్నారు. మరో యజమాని "పేరు మార్పుతో జట్టులో కొత్త ఉత్తేజం వచ్చిందని, తమ స్టాఫ్ యువకుల్లో ఉన్న టాలెంట్ని గుర్తించడంలో ఎప్పుడు ముందుంటారని, ఈ ఏడాది కైఫ్ కూడా చేరడంతో తమ జట్టుకు మరింత బలం చేకూరింది" అని పార్ధ్ జిందాల్ తెలిపారు.