హెట్మెయిర్, అలీని తప్పించాలి
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ హెట్మెయిర్, అలీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. ఆర్సీబీ యాజమాన్యంతో పాటు అభిమానులు సైతం హెట్మెయిర్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సీజన్లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో వీరి స్థానంలో వేరొకరిని ఆడించడం లేదా లోకల్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి.
నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీలను ఆడించాలి
ఆర్సీబీ జట్టులో ఉన్న పేస్ బౌలర్లు నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీ. ఈ ఇద్దరినీ కోహ్లీ ఇప్పటివరకు సరిగా వినియోగించుకోలేదని అభిమానుల వాదన. దీంతో తుది జట్టులో వీరికి చోటు కల్పిస్తే... జట్టు విజయాల్లో కొంతమేరకు ప్రభావం చూపిస్తారని అభిమానులు అంటున్నారు. అంతకముందు కుదిరిన కొన్ని ఒప్పందాల కారణంగా నాథన్ కౌల్టర్ నైల్ తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. మరోవైపు టిమ్ సౌథీ అందుబాటులో ఉన్నప్పటికీ అతడి సేవలను ఆర్సీబీ వినియోగించుకోలేదు.
దేశవాళీ క్రికెటర్లపై నమ్మకముంచాలి
ఐపీఎల్లో విజయాలను నమోదు చేస్తోన్న జట్లను చూస్తే అందులో దేశవాళీ క్రికెటర్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లనే తీసుకుంటే ఆయా జట్లలో దేశవాళీ క్రికెట్లో రాణించిన యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న తీరు నిజంగా అద్భుతం. అయితే, ఆర్సీబీ మాత్రం లోకల్ క్రికెటర్లతో పోలిస్తే... విదేశీ క్రికెటర్లపైనే అతిగా ఆధారపడటం విశేషం.
ఆర్సీబీ తుది జట్టు ఇలా ఉండాలి
వాషింగ్టన్ సుదంర్, పార్ధీవ్ పటేల్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్, శివం దూబే, పవన్ నేగి, నాథన్ కౌల్టర్ నైల్, టిమ్ సౌథీ, యజువేంద్ర చాహల్, నవదీప్ షైనీ/మహ్మద్ సిరాజ్