జట్టుని ముందుండి నడిపిస్తున్న దినేశ్ కార్తీక్
ఈ సీజన్ ఆరంభం నుంచీ దినేశ్ కార్తీక్ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. తన ప్రదర్శనతో కెప్టెన్గా జట్టులోని మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు.
490 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్
ఈ సీజన్లో దినేశ్ కార్తీక్ ఇప్పటివరకు 490 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తరుపున ఓ ఆటగాడు చేసిన ఆత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గత సీజన్ల పరంగా చూస్తే కోల్కతా నైట్రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాబిన్ ఉతప్ప(660-2014 సీజన్) ముందు వరుసలో ఉన్నాడు.
క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన కోల్కతా
ఆ తర్వాత గౌతమ్ గంభీర్ (590-2012, 501-2016, 498-2017) అత్యధక పరుగుల్ని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో సౌరవ్ గంగూలీ(493-2008 సీజన్) ఉన్నాడు. కాగా బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా 25 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
కోల్కతా విజయంలో దినేశ్ కార్తీక్ కీలకపాత్ర
ఈ విజయంలో కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ (52;38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. కోల్కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్కతా బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు తీయగా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్లు తలో వికెట్ తీశారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వాలిఫయిర్-2
ఈ విజయంతో కోల్కతా నైట్రైడర్స్ శుక్రవారం ఇదే వేదికగా క్వాలిఫయిర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ముంబైలోని వాంఖడె వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. చెన్నై ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే.