పాండ్య ఇన్నింగ్స్ చూసినవాళ్లంతా షాక్:
ఈ మ్యాచ్లో పాండ్య ఇన్నింగ్స్ చూసిన వారు ఎవరైనా ఔరా అనాల్సిందే. ఆడిన ప్రతి బంతికి పరుగులు రాబట్టాడు. 9 బంతుల్లో ఐదు బౌండరీలే. అందులో నాలుగు సిక్స్లు, ఒక్క ఫోర్. మ్యాచ్ అనంతరం పాండ్య తన ఇన్స్టాగ్రం ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
|
ధోనీ కూతురు ఒక చీర్ లీడర్
‘నన్ను ప్రోత్సహించేందుకు ఒక చీర్ లీడర్ దొరికిందని అనుకుంటున్నాను' అని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ చీర్ లీడర్ ఎవరో తెలుసా. మహేంద్ర సింగ్ ధోనీ గారాలాపట్టి జీవా. ‘కమాన్... కమాన్.. హార్దిక్' అంటూ జీవా ఆ వీడియోలో సందడి చేసింది. ఈ వీడియోను ధోనీ భార్య సాక్షి... పాండ్యకు పంపించిందట. ఆ వీడియోను హార్దిక్ అభిమానులతో పంచుకున్నాడు.
20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు
తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్సులు(70), సురేశ్ రైనా 45 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు (69), హార్దిక్ పాండ్య 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో (32) నాటౌట్లతో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇదే ఉత్సాహంతో ఇంగ్లాండ్తో ఆడేందుకు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు మరోసారి భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/16), చాహల్ (3/21) ధాటికి చేతులెత్తేసింది. క్రమం తప్పకుండా స్పిన్నర్లు వికెట్లు తీయడంతో ఆ జట్టు 12.3 ఓవర్లలో 70 పరుగులకే పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఏడు మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమవగా.. అందులో ముగ్గురు డకౌటవడం విశేషం. 2-0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా అదే ఉత్సాహంతో ఇంగ్లాండ్తో ఆడేందుకు సిద్ధం కానుంది. ఈ క్రమంలో జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్లు జరగనున్నాయి.