|
పర్యవేక్షణలో జట్టు సభ్యులంతా కఠోర సాధన
జట్టు ప్రధాన కోచ్ రవి శాస్త్రి పర్యవేక్షణలో జట్టు సభ్యులంతా కఠోర సాధన చేశారు. టీమిండియాలో తాజాగా చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా నెట్ ప్రాక్టీస్లో చెమటోడ్చడం అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది. అడిలైడ్ వేదికగా 31 పరుగులతో ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో మాత్రం టీమిండియాను146 పరుగుల ఆధిక్యంతో శాసించింది. దీంతో 1-1తో సిరీస్ను సమం చేసుకుని మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.
|
మయాంక్ను అనూహ్యంగా ఆస్ట్రేలియా రప్పించి
పెర్త్లో ఓపెనర్లు నిరాశపరచడంతో జట్టులో కీలక మార్పులు చేపట్టిన టీమిండియా కర్ణాటక క్రికెటర్ మయాంక్ అగర్వాల్ను అనూహ్యంగా ఆస్ట్రేలియా రప్పించి జట్టులో స్థానం కల్పించింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలకు జట్టులో స్థానం కల్పించారు. పాండ్యా.. ఆసియా కప్ జరుగుతన్న సమయంలో నడుం కింది భాగంలో గాయం కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. పృథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.
|
అశ్విన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేక
రవిచంద్రన్ అశ్విన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టుకు దూరమైయ్యాడు. గాయంతోనే పెర్త్ టెస్టులో ఆడిన అశ్విన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఫిట్నెస్ను త్వరగా సాధించాడని మూడో టెస్టులోకి తీసుకుంది టీమిండియా.