పుజారా ఒంటరి పోరాటం
మరో ఎండ్లో పుజారా నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అశ్విన్ ఔట్ అనంతరం ఇషాంత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 75 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 73, ఇషాంత్ 0 పరుగులతో ఉన్నారు.
నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్లు
అంతకముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్(2), మురళీ విజయ్(11) మరోసారి నిరాశ పరిచారు. అనంతరం క్రీజులోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 11 ఓవర్ మూడో బంతికి కోహ్లి పెవిలియన్కు చేరాడు. పాట్ కమిన్స్ వేసిన వైడ్ బాల్ను ఆఫ్సైడ్ బాదాడు.
ఒంటిచేత్తో కోహ్లీ క్యాచ్ పట్టిన ఉస్మాన్ ఖవాజా
ఈ క్రమంలో బౌండరీ వైపు దూసుకుపోతున్న బంతిని ఊహించనివిధంగా ఎడమవైపు డైవ్ చేసి ఉస్మాన్ ఖవాజా ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్కి విరాట్ కోహ్లీ సైతం అవాక్యయ్యాడు. దీంతో నిరాశగా విరాట్ కోహ్లీ పెవిలియన్కు చేరాడు. మైదానంలోని సహచరులంతా ఖవాజాను అభినందనలతో ముంచెత్తారు.
75 ఓవర్లకు టీమిండియా 190/7
ఆ తర్వాత రహానే(13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25) తొందరగానే పెవిలియన్ చేరుకున్నారు. ఆసీస్ బౌలర్స్లో హాజిల్వుడ్కి రెండు, లియాన్కి రెండు, కమిన్స్ రెండు వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీశాడు.