
హైదరాబాద్: వాంఖడె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద రోహిత్ శర్మ(10) వికెట్ను కోల్పోయింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్ట్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని మిడాఫ్ మీదుగా ఆడటానికి రోహిత్ యత్నించాడు.
ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(26), కేఎల్ రాహుల్(9) పరుగులతో ఉన్నారు. రోహిత్ ఔటైన తర్వాత రాహుల్ క్రీజులోకి వచ్చాడు.
వీరిద్దరూ నిలికడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒక క్యాలెండర్ ఇయర్లో చివరి మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీలు సాధించిన రోహిత్ ఈసారి మాత్రం విఫలమయ్యాడు. 2019లో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ 133 పరుగులు సాధించాడు.
అంతకుముందు 2016లో వాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో 171 పరుగులు చేశాడు. 2015లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 138 పరుగులు సాధించాడు. ఇలా... ఒక క్యాలెండర్ ఇయర్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ వరుసగా సెంచరీ సాధించాడు.