చాలా దేశాలు అండగా
"ఎన్నో దేశాలు పుల్వామా ఉగ్రగాడి ఘటన అనంతరం మనకు అండగా ఉంటామని చెప్పాయి. కానీ పాక్ మాత్రం కనీసం పలకరించలేదు. అలాంటి దేశ జట్టుకు మనతో ఆడే అర్హత లేదు. మనం ఇక్కడ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే జవాన్లు అక్కడ సంబరాలు చేసుకుంటారు. క్రికెట్కు వాళ్లు అంత గౌరవం ఇస్తున్నప్పుడు మనం దానిని కాపాడుకోవాలి" అని అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు.
భారత్-పాక్ దేశాలు ఎక్కడా మ్యాచ్లు ఆడకూడదు
"భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగకపోతే ఇంకెక్కడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరగకూడదు. ఐసీసీ, బీసీసీఐ ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి" అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది వరల్డ్కప్ను ఐసీసీ రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తోంది. ఈ విధానం ప్రకారం టోర్నీలో పాల్గొంటోన్న ఒక జట్టు మిగతా అన్ని జట్లతో ఆడాలి.
భారత్-పాక్ మ్యాచ్ ఆడకపోతే!
టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అంటే ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడుతుంది. చివరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు సెమీస్లో తలపడతాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. పాక్తో మ్యాచ్ రద్దు చేసుకున్నా తొలి నాలుగు స్థానాల్లో నిలిస్తే ఫర్వాలేదు. అలా కాకుండా మిగతా జట్లతో జరిగిన మ్యాచ్ల్లో భారత్ ఓడితే మాత్రం సెమీస్ చేరుకొనే అవకాశాలు చేజారుతాయి.