టోర్నీల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని
టోర్నీల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని తిరిగి ఆటలోనే పెడుతామని అన్నారు. విండీస్లాంటి దేశాల్లో ఆదాయాన్ని సృష్టించడం సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. భారత్లో కచ్చితంగా పన్ను మినహాయింపును సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కోకకోలాతో ఐసీసీ ఐదేళ్ల ఒప్పందాన్ని చేసుకుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
కోహ్లీ క్రికెట్కు అతిపెద్ద రాయబారి
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్కు అతిపెద్ద రాయబారి అని రిచర్డ్సన్ చెప్పుకొచ్చారు. టీమిండియా సత్ప్రవర్తన కలిగిన జట్టు అని.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అంశం బీసీసీఐ పరిష్కరిస్తుందని తెలిపారు. ఇది చాలా చిన్న సమస్య అని అన్నారు.
భారత్ జట్టు మంచి ప్రవర్తనతో మెలుగుతుంది
"మైదానంలో భారత్ జట్టు మంచి ప్రవర్తనతో మెలుగుతుంది. అంపైర్ నిర్ణయాలను గౌరవిస్తుంది. క్రీడాస్ఫూర్తితో మ్యాచ్లు ఆడుతుంది. జట్టు మొత్తం సమిష్టిగా విజయాల కోసం కష్టపడుతుంది. ఇక కోహ్లీ ఆటకే అతిపెద్ద రాయబారి. టీ20ల గురించే కాకుండా టెస్ట్, వన్డే ఫార్మాట్ల గురించి కూడా ఆత్మీయంగా మాట్లాడుతాడు. ఇలాంటి మంచి ఆటగాళ్లందరూ అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నాం" అని రిచర్డ్సన్ అన్నారు.
ధోనిది కీలక పాత్ర
ఇటీవల కాలంలో టీమిండియా ప్రదర్శన, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ వంటి అంశాలను ఈ సందర్భంగా రిచర్డ్సన్ ప్రశంసించారు. టీమిండియా విజయాల్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది కీలక పాత్ర అని చెప్పిన రిచర్డ్సన్, బ్యాటింగ్, బౌలింగ్లో ఆ జట్టు పటిష్టంగా తయారైందని చెప్పారు. స్పిన్నర్లు కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.