63.27 విజయ శాతంతో టీమిండియా
ఇప్పటివరకు టీమిండియా మొత్తం 116 టీ20లు ఆడగా 63.27 విజయ శాతంతో 71 మ్యాచ్లు గెలుపొందింది. ఈ జాబితాలో పాకిస్థాన్ జట్టు 143 మ్యాచ్ల్లో 90 విజయాలు నమోదు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇక, పాక్ తర్వాత ఎక్కువ టీ20 మ్యాచ్లు గెలుపొందిన భారత జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.
నాలుగు వికెట్ల తేడాతో విజయం
ఇదిలా ఉంటే వెస్టిండిస్తో శనివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే స్టేడియంలో జరిగిన రెండో టీ20లో సైతం టీమిండియా విజయం సాధించి సిరిస్ను సొంతం చేసుకుంది. ఇక, ఆగస్టు 6న జరగనున్న మూడో టీ20 గుయానా వేదకగా జరగనుంది.
విరామ సమయం.. ఆర్మీ బెటాలియన్తో వాలీబాల్ ఆడిన ధోనీ (వీడియో)
హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించగా విరాట్ కోహ్లీ (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్), కృనాల్ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు.
రావ్మన్ పావెల్ ఒక్కడే
విండీస్ బౌలర్లలో థామస్ (2/27), కాట్రెల్ (2/25) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో రావ్మన్ పావెల్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించగా... మిగతా వారంతా నిరాశ పరిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, పేసర్ భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.
టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ
వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేత
విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి వర్తింపజేయగా... వెస్టిండిస్ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉండటంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు.