శుభారంభం అందించినా..
అంతకుముందు 53/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓవర్నైట్ బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్ (31), ఒవర్టన్ (1 )వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. ముందుగా నైట్ వాచ్మన్ ఓవర్టన్ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత డెవిడ్ మలాన్ను కూడా స్లిప్ క్యాచ్గానే ఔట్ చేశాడు. దాంతో 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, ఓలీపోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో బెయిర్ స్టో వరుస బౌండరీలతో దూకుడు కనబర్చగా.. శార్దూల్, ఉమేశ్ బౌలింగ్లోనూ ఓలీ పోప్ ధాటిగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్ 139/5 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
ఒలి పోప్ హాఫ్ సెంచరీ..
ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్ సెషన్ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. ఇక లంచ్ బ్రేక్ తర్వాత సిరాజ్.. బెయిర్ స్టోను ఔట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. 89 పరుగుల బిగ్ పార్టనర్షిప్కు తెరదించాడు. ఆ తర్వాత మొయిన్ అలీ బ్యాటింగ్కు రాగా.. ఓలీ పోప్ 92 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొయిన్ అలీ(35)తో కలిసి ఏడో వికెట్కు కీలక 71 పరుగులు జత చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా అద్భుత బంతితో విడదీశాడు. మోయిన్ అలీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ క్రీజులోకి రాగా ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను 227/7తో ముగించాడు.
క్రిస్ వోక్స్ మెరుపులు..
ఆ తర్వాత కొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఓలిపోప్ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఓలీ రాబిన్సన్(5)ను జడేజా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ క్రిస్ వోక్స్ కొరకరాని కొయ్యాలా మారి చివరి వికెట్కు కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో భారీ షాట్ ఆడి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సింగిల్ తీసి స్టైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన క్రిస్ వోక్స్ రనౌటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
భారత్ 191 ఆలౌట్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్ (5)ను బౌల్డ్ చేశాడు. హమీద్ (0)ను కీపర్ పంత్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ఉమేశ్ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్ రూట్ (21)ను క్లీన్బౌల్డ్ చేశాడు. కానీ ఈ శుభారంభాన్ని భారత్ బౌలర్లు కొనసాగించలేకేపోయారు. లోయరార్డర్, లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ను ఔట్ చేయలేక ఆతిథ్య జట్టుకు భారీ లీడ్ అందించారు.