అదే ఆశతో పెరిగాను:
ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... '1960లో పాకిస్తాన్ చాలా అద్భుత దేశం. ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేది. నేను అదే ఆశతో పెరిగాను. కానీ.. దురదృష్టవశాత్తు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. ప్రజాస్వామ్యం గతి తప్పడంతో.. సైన్యం రంగప్రవేశం చేసింది. పాకిస్థాన్ పితామహులు తెలివిగా పనిచేశారు. మానవత్వం, సామాజిక న్యాయం కోరుకున్నారు. కానీ.. అది పక్కదారి పట్టింది. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం ఖాయం' అని అభిప్రాయపడ్డారు.
భారత్ను తరచుగా ఓడించేవాళ్లం:
'భారత్ పరిమాణంలో పాకిస్తాన్ కన్నా ఏడు రెట్లు పెద్దది. కానీ.. నేను క్రికెట్ ఆడుతున్న రోజుల్లో భారత్ను తరచుగా ఓడించేవాళ్లం. హాకీ, ఇతర క్రీడలలో కూడా పాక్ ఆధిపత్యం చెలాయించింది. క్రికెట్ నుంచి ఎంతో నేర్చుకున్నా. క్రీడల్లో రెండో స్థానంలో నిలిస్తే మర్యాద ఉండదని తెలుసుకున్నా. అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదు. కనీసం సానుభూతి కూడా చూపేవారు కాదు' అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి రాగానే నవ్వారు:
'నేను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారు. కానీ.. ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. దేశంలో అనేక సహజ వనరులున్నాయి. సులభతర వాణిజ్య సూచీలో మెరుగైన స్థానాన్ని పొందడమే మా లక్ష్యం' అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. క్యాన్సర్తో చనిపోయిన తన తల్లి పేరుతో 'క్యాన్సర్ ఆస్పత్రి'ని కట్టించి నష్టం వచ్చినా 70 శాతం ఉచిత వైద్యం ఎలా అందిస్తున్నా అని అన్నారు. మీడియా నన్ను లక్ష్యంగా చేసుకొని ప్రతికూల వార్తలతో గురిపెడుతుంది. అందుకే ఉదయం పూట వార్తా పత్రికలను చదవడం, టీవీ చాట్ షోలు చూడటమే మానేశా అని తెలిపారు.