సెమీస్కు చేరిన ఆస్ట్రేలియా మహిళల జట్టు
అనంతరం ఆసీస్ బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు 17.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్పై ఆస్ట్రేలియా జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. దీంతో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్కు అర్హత సాధించింది.
|
ఐర్లాండ్పై పాకిస్థాన్ విజయం
మరో మ్యాచ్లో భాగంగా ఐర్లాండ్పై పాకిస్థాన్ విజయం సాధించింది. సెమీఫైనల్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఐర్లాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో కెప్టెన్ జవేరియా ఖాన్ మెరుపు ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన జవేరియా ఖాన్ ఐర్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించి 52 బంతుల్లో 11 ఫోర్లతో 74 పరుగులు చేసింది.
|
101 పరుగులు చేసి ఆలౌటైన ఐర్లాండ్ జట్టు
అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మహిళల జట్టు 101 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా మిర్, ఆలియా రియాజ్, నష్రా సంధు, ఐమన్ అన్వర్ తలో రెండు వికెట్లు తీశారు. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జవేరియాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో పాక్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేస్లో నిలిచింది.
న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనున్న పాకిస్థాన్
లీగ్ స్టేజి ఆఖరి మ్యాచ్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధిస్తే సెమీస్కు వెళ్తుందా? లేదా అనేది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.