|
ఐసీసీ '#10YearChallenge'లో
ఈ ట్వీట్స్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఐసీసీ '#10YearChallenge'లో పదేళ్ల క్రితం అంటే 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్లో ఉన్న ఆటగాళ్ల జాబితా.. 2019లో ఇప్పటివరకు టాప్ ర్యాంక్లో ఉన్న ఆటగాళ్ల జాబితాకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ ట్వీట్ చేసింది.
|
2019లో అగ్రస్థానంలో కోహ్లీ
ఈ ట్వీట్ ప్రకారం.. 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్లో ఉన్న ఆటగాళ్లలో నెంబర్ వన్ బ్యాట్స్మన్గా వెస్టిండీస్కు చెందిన ఆటగాడు శివనారాయణ్ చందర్పాల్ ఉండగా, ప్రస్తుతం అంటే 2019లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
|
బీసీసీఐ ఇలా
ఇక బౌలింగ్ జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్ధానంలో ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా బీసీసీఐ సైతం ఈ ‘#10YearChallenge'లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది.