టాస్ మన చేతుల్లో ఉండదు:
కోహ్లీ మాట్లాడుతూ...'టాస్ మన చేతుల్లో ఉండదు. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. అసలు టాస్ను పట్టించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మేము అలాగే ఆడుతున్నాం. టాస్ ఓడిపోయినంత మాత్రాన వెనుకపడినట్లు కాదు.. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఒత్తిడి సహజం:
'పిచ్తో సంబంధం లేకుండా అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం. రెండో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించేటపుడు చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో తప్పులు చేస్తే.. మ్యాచ్ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మళ్లీ మనం పుంజుకోవాలంటే కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడుతా. అయితే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఒత్తిడి మరింత ఉంటుంది.. అలాగే తప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువే' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అక్కడే ఆడాలనేమీ లేదు:
'నేను భారీ స్కోర్లు సాధించలేదనే బెంగ లేదు. ప్రపంచకప్లో జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నా. మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్ను నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇన్నింగ్స్ మొదటలో మంచి ఆరంభం ఇస్తే.. తర్వాత పాండ్యా, పంత్, ధోనీ భారీ షాట్లతో చెలరేగిపోతారు. భారీ ఆరంభం లభించినప్పుడు మూడో స్థానంలో వేరేవారిని పంపిస్తాను. అక్కడ నేనే ఆడాలనేమీ లేదు. పరిస్థితిని బట్టి మార్పులు అవసరం. దాని వల్లే మ్యాచ్లు గెలుస్తున్నాం' అని కోహ్లీ తెలిపాడు.
ఆ ఇద్దరే కీలకం:
ఈ ప్రపంచకప్లో ఓపెనర్ రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అతను మరో రెండు సెంచరీలు కూడా సాధిస్తాడని అనుకుంటున్నా. ఇక న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్లతో పాటు రాస్ టేలర్ కీలక ఆటగాళ్లు. ఇద్దరినీ తొందరగా పెవిలియన్కు పంపి కివీస్పై ఒత్తిడి తీసుకొస్తాం' అని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.