ఇంగ్లాండ్ వేదికగా టీ20 సిరీస్కి కూడా
వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్ల కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. అందులో కృనాల్ పాండ్యాకి చోటిచ్చిన విషయం తెలిసిందే. ఆల్రౌండర్ వైఫల్యాన్ని పూరించేందుకు టీమిండియా సెలక్టర్లు ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టీ20 సిరీస్కి కూడా అప్పట్లో కృనాల్ను ఎంపిక చేశారు. కానీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
ర్యాంకుల్లో తనతో పాటు భారత్నూ టాప్లో నిలిపిన కోహ్లీ
తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు
ఎడమచేతి వాటం స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండటంతో కృనాల్కి టీమిండియా మేనేజ్మెంట్ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు అతను గాయపడటంతో.. వెస్టిండీస్తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్లో కృనాల్ పాండ్యాకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్కి సన్నద్ధమవుతోన్న కృనాల్ పాండ్య తాజాగా మీడియాతో మాట్లాడాడు.
అందరితోనూ సింపుల్గా.. చూసి ఆశ్చర్యపోయా.
‘మహేంద్రసింగ్ ధోనీతో కేవలం ఆరు రోజులు మాత్రమే కలిసి ఉండే అవకాశం అప్పట్లో (ఇంగ్లాండ్ గడ్డపై) నాకు దక్కింది. ఆ సమయంలో అతని నిరాడంబరత, ఒదిగి ఉండేతత్వం నన్ను ఆకట్టుకున్నాయి. గొప్ప విజయాలు సాధించినా.. అందరితోనూ అతను సింపుల్గా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. ధోనీలా ఎదగాలి, ఉండాలని' అని కృనాల్ పాండ్యా వెల్లడించాడు.