నన్ను బలి పశువును చేశారు
అంతేకాదు అవసరమైతే పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డుని ఏంజెలో మాథ్యూస్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా మాథ్యూస్ మాట్లాడుతూ "ఆసియాకప్లో బంగ్లాదేశ్, అప్ఘన్లపై శ్రీలంక పేలవ ప్రదర్శనకు నన్ను బలి పశువును చేశారు" అని అన్నాడు.
కెప్టెన్సీ నుంచి ఉన్నపళంగా తప్పించారు
"నన్ను కెప్టెన్సీ నుంచి ఉన్నపళంగా తప్పించారు. ఈ విషయంలో నన్ను ఒక్కడినే బాధ్యున్ని చేయడం సబబేనా?" అని శ్రీలంక క్రికెట్ బోర్డుకు మాథ్యూస్ లేఖ రాశాడు. అయితే, టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టు 137 పరుగుల తేడాతో ఓడిపోగా, ఆ తర్వాత పసికూన ఆప్ఘన్ చేతిలో సైతం ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సమర్ధించుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు
దీంతో, జనవరి 2017 నుంచి శ్రీలంక ఆడిన 40 వన్డేల్లో 30 వన్డేల్లో ఓటమి పాలు కావడం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మాథ్యూస్ను తప్పించడాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు సమర్ధించుకుంది. దినేశ్ చండీమాల్కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే క్రమంలోనే మాథ్యూస్ను తప్పించినట్లు పేర్కొంది.
అక్టోబర్ 10 నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు
త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనున్న సందర్భంలో కెప్టెన్ను మార్చినట్లు బోర్డు తెలిపింది. ప్రస్తుతం దినేశ్ చండీమాల్ శ్రీలంక టెస్టు జట్టుకు సారథిగా వ్యవహారిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు అక్టోబర్ 10 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఆడనుంది.