|
పాండ్యా సోదరులు అరుదైన ఘనత
ఇదే జరిగేతే పాండ్యా సోదరులు అరుదైన ఘనత సాధించనున్నారు. భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన మూడో బ్రదర్స్గా గుర్తింపు పొందనున్నారు. అంతకముందు భారత్ తరుపున అమర్నాథ్ సోదరులు, పఠాన్ సోదరులు ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ తరుపున కలిసి ఆడారు.
తొలి టెస్ట్ సెంచరీ సాధించిన
భారత్ తరఫున తొలి టెస్ట్ సెంచరీ సాధించిన లాల్ అమర్నాథ్ కుమారులైన మహిందర్ అమర్ నాథ్, సురీంధర్ అమర్ నాథ్లు భారత్ తరపున బ్రదర్స్గా తొలిసారి బరిలోకి దిగారు. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు భారత్కు ప్రాతినిధ్యం వహించి ఈ జాబితాలో చేరారు. పఠాన్ సోదరులు ఎన్నో అద్భుతమైన మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేసి భారత్కు చిరస్మరణీయ విజయాలను అందించారు.
59 పరుగుల భాగస్వామ్యం
2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. తాజాగా ఇప్పుడు భారత్ తరఫున పాండ్యా సోదరులు బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఇంగ్లాండ్తో గతేడాది ముగిసిన టీ20 సిరీస్లోనే పాండ్యా సోదరులు కలిసి బరిలో దిగాల్సి ఉండగా కృనాల్కు తుది జట్టులో చోటు దక్కలేదు.
విండిస్తో జరిగిన మ్యాచ్లో కృనాల్ అరంగేట్రం
ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో కృనాల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి బరిలోకి దిగలేదు.