ఐపీఎల్ అనంతరం ఇంగ్లండ్కు:
రహానే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-12లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహించాడు. తాజాగా ఒక శతకం కూడా చేసాడు. ఐపీఎల్ ముగిసిన అనంతరం రహానే ఇంగ్లండ్కు వెళ్లనున్నాడు. వన్డే లీగ్ ఏప్రిల్ 25న మొదలై.. మే 25తో ముగుస్తుంది.
బీసీసీఐకి కృతజ్ఞతలు:
ఈ అరుదైన అవకాశం రావడంపై రహానె మాట్లాడుతూ... 'హ్యాంప్షైర్కు ఆడుతున్న తొలి భారతీయుడిని కావడం ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కౌంటీ క్రికెట్కు మంచి పేరుంది. నా వంతుగా ఎక్కువ పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేస్తాను. కౌంటీల్లో ఆడేందుకు నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు' అని రహానే పేర్కొన్నారు.
రహానే మంచి క్లాస్ ఆటగాడు:
'గతంలో రహానే కౌంటీల్లో ఆడేందుకు ఆసక్తి చూపాడు. మార్క్రమ్, కరుణరత్నే ఇద్దరూ ప్రపంచకప్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోవడంతో.. రహానేను తీసుకున్నాం. రహానే మంచి క్లాస్ ఆటగాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా సేవలు అందిస్తాడు. అతడు జట్టులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. అతని రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం' అని హ్యాంప్షైర్ యాజమాన్యం తెలిపింది.