ఢిల్లీ: క్రీడాకారులు ఫామ్లో ఉన్నంత కాలం అందరికీ గుర్తుంటారు. ఒక్కసారి క్రీడులకు దూరమయ్యారా? అంటే వారిని పట్టించుకునే వారుండరు. ఇందుకు సంబంధించిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 1978లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా గేమ్స్లో 20 కిలోమీటర్ల పరుగు పందెంలో హకం సింగ్ బట్టల్ అనే అథ్లెట్ స్వర్ణ పతకం సాధించాడు.
ప్రస్తుతం హకం సింగ్ బట్టల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం హకం సింగ్ బట్టల్ భార్య బియంత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ చికిత్స చేయించడానికి డబ్బులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
"64 ఏళ్ల హకం కిడ్నీ, లివర్కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నాడు. పెన్షన్ కింద నెలకు రూ.7 వేలు అందుకుంటున్నాం. ట్రీట్మెంట్కు చాలా డబ్బులు అవసరం. మా దగ్గర అంత డబ్బు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాయం చేయాలని కోరుకుంటున్నా" అని హకం భార్య ఆవేదన వ్యక్తం చేశారు.
Can u send me his contact no plz https://t.co/QvRmxg7dBX
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 30, 2018
దీంతో ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పలువురు అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పంజాబ్లోని బర్నాలా డిప్యూటి కమిషనర్ ధర్మపాల్ గుప్తా రూ.20 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్ కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. "హకం సింగ్ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు వారి ఫోన్ నంబర్ల తెలపండి" అంటూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.