అరంగేట్రం అదుర్స్
ఉమ్రాన్ కాకుండా గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన మరో పేసర్ అర్షదీప్ సింగ్. ఈ ఎడం చేతి వాటం పేసర్ గతేడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో అరంగేట్రం చేసిన అతను.. 2022లో మొత్తం 21 మ్యాచుల్లో 33 వికెట్లు తీసుకొని రాణించాడు. టీ20 వరల్డ్ కప్లో కూడా బుమ్రా వంటి సీనియర్ పేసర్ లేని లోటును పూడ్చటంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతని భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, టీమిండియాకు జహీర్ ఖాన్ తర్వాత మరో మంచి ఎడం చేతి వాటం స్పిన్నర్ దొరికాడని అనుకున్నారు.
తేలిపోతున్న అర్షదీప్..
ఇటీవలి కాలంలో అతని ఆటతీరు చాలా మారిపోయింది. ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఎడతెరిపి లేకుండా నోబాల్స్ వేస్తున్నాడు. ఇది అతని అతి పెద్ద సమస్య అని గంభీర్ అన్నాడు. అర్షదీప్ తన బౌలింగ్లో వేరియేషన్స్ తెచ్చుకోవాలని సూచించాడు. 'నువ్వు ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్ కాదు. కాబట్టి బౌలింగ్లో వేరియేషన్స్ తెచ్చుకోవాలి. అలా చేయకపోతే అతని బౌలింగ్ గణాంకాలు అయితే అద్భుతంగా ఉంటాయి. లేదంటే పరమచెత్తగాా ఉంటాయి' అని గంభీర్ వివరించాడు.
నోబాల్స్ గురూజీ..
కొన్ని రోజుల క్రితం శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ చూసిన ఎవరూ అర్షదీప్ను మర్చిపోరు. ఎందుకంటే ఆ సిరీస్ రెండో టీ20లో అతను ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. క్రికెట్ చరిత్రలో మరే భారత బౌలర్ కూడా ఒక మ్యాచ్లో ఇన్ని నోబాల్స్ వేయలేదు. తాజాగా కివీస్తో జరిగిన తొలి టీ20లో కూడా చివరి ఓవర్లో బంతి అందుకొని 27 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే నోబాల్ వేశాడు. ఇది చూసిన చాలా మంది మాజీలు అర్షదీప్ బౌలింగ్లో నోబాల్స్ పెద్ద సమస్య అని తేల్చిచెప్పాడు. గంభీర్ కూడా ఈ విషయంపై అర్షదీప్ ఫోకస్ పెట్టాలని, ఇది చాలా ముఖ్యమని చెప్పాడు. మరి అతను ఏం చేస్తాడో చూడాలి.