నవంబరు 9 నుంచి 18 వరకు మహిళల వరల్డ్ టీ20
ఈ ఫార్మాట్లో భారత్ ఇప్పటివరకు మెరుగ్గా ఆడింది లేదు. దీంతో ఈసారి టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు భావిస్తోంది. టోర్నీలో భాగంగా నవంబరు 9 నుంచి 18 వరకు గయానా, సెయింట్ లూసియా ఆతిథ్యమిస్తాయి. సెమీఫైనల్స్, ఫైనల్ 22, 24న అంటిగాలో జరుగుతాయి.
2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్ను
2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్ను చార్లెట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ టైటిల్స్తో చరిత్ర సృష్టించింది. 2010, 2012, 2014 టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు టైటిల్స్ సాధించి అరుదైన ఘనత సాధించింది.
2016లో సంచలన ప్రదర్శన చేసిన వెస్టిండిస్ జట్టు
2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో వెస్టిండిస్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఫైనల్లో ఆస్ట్రేలియానే ఓడించి తొలి సారిగా ఈ ఫార్మాట్లో ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. "2009 నుంచి జరిగిన అన్ని మహిళల టీ20 ప్రపంచకప్పుల్లోనూ నేను ఆడా. అవన్నీ పురుషుల టోర్నీతో పాటే జరిగాయి. ప్రేక్షకులు చూశారు. బాగానే ప్రచారం జరిగింది. కానీ, పురుషుల టోర్నీలతో పాటు జరగడం వల్ల మహిళల టోర్నీలు మరుగున పడిపోయాయన్నది నా అభిప్రాయం" అని ఐసీసీ వెబ్సైట్కు రాసిన కాలమ్లో జులన్ పేర్కొన్నారు.
దేశవాళీ మ్యాచ్లకు రైళ్లకు బదులు విమానంలో
ఎప్పుడైతే బీసీసీఐ పరిధిలోకి వెళ్లిందో భారత మహిళల క్రికెట్ పూర్తిగా మారిపోయిందని అన్నారు. "మహిళల క్రికెట్ బీసీసీఐ ఆధ్వర్యంలోకి వెళ్లాక, దేశవాళీ మ్యాచ్లకు కూడా రైళ్లకు బదులు విమానంలో పంపించడం మొదలైంది. ఇంతకుముందు రైళ్లలో కూర్చునే స్థలం కోసం ఇతర ప్రయాణీకులతో కొట్లాడేవాళ్లం. ఇప్పుడు విమానంలో కిటికీ సీటు కోసం ఒకరితో ఒకరం పోట్లాడుకుంటున్నాం" అని జులన్ వెల్లడించారు.