టెస్టు సెంటర్స్ను ప్రోత్సహించడం
"అభిమానులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించొచ్చు. సీజన్ మొదలైనప్పుడు ఢిల్లీ తర్వాత బెంగళూరు, ముంబై, కోల్కతాలో టెస్టులు నిర్వహిస్తే బాగుంటుంది. టెస్టు సెంటర్స్ను ప్రోత్సహించడం టెస్ట్ క్రికెట్కు చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈ సీజన్ ప్రారంభానికి ముందు మీరు టెస్ట్ మ్యాచ్లు ఎక్కడెక్కడ మ్యాచులు జరుగుతాయో ముందే తెలుస్తుంది" అని కుంబ్లే అన్నాడు.
టెస్ట్ క్రికెట్ను బాగా మార్కెట్ చేసుకోవచ్చు
"ద్వారా టెస్ట్ క్రికెట్ను బాగా మార్కెట్ చేసుకోవచ్చు. అభిమానులు స్టేడియాలకు వచ్చేలా చేయొచ్చు. నేను కోచ్గా ఉన్నప్పుడు ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచులు జరిగాయి. అన్నీ కొత్తవే. అందులో ఇండోర్ మాత్రమే అభిమానులతో నిండింది. అక్కడి వాతావరణం చాలా బాగుంది. నగరం నడిబొడ్డున మైదానం ఉంది. అందుకే సమయంతో సంబంధం లేకుండా ఆటను చూడ్డానికి వచ్చారు" అని కుంబ్లే తెలిపాడు.
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
"టెస్టు మ్యాచ్లు చూసేందుకు వచ్చే అభిమానులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. సౌకర్యవంతమైన సీట్లు, స్టేడియానికి ప్రవేశం, టికెటింగ్, టిక్కెట్లను జారీ చేసేటప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి. దీంతో పాటు ఆహారం, నీరు, మరుగుదొడ్ల వసతులు మెరుగ్గా ఉండాలి. ఇవన్నీ మనం అందిస్తే ప్రేక్షకులు మైదానాలకు రావొచ్చు" అని కుంబ్లే పేర్కొన్నాడు.
డే-నైట్ టెస్టులు జనాలను ఆకర్షిస్తాయి
"డే-నైట్ టెస్టులు జనాలను ఆకర్షిస్తాయి. ఆట యొక్క చివరి భాగంలో జనాలు బాగా వస్తారని నేను అనుకుంటున్నాను. ఏడాదిలో డే-నైట్ టెస్టుకు ఏది అనువైన సమయమో గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు డే-నైట్ వన్డేలు, టీ20ల్లో బంతి తడిసిపోతుంది. కాబట్టి, వేదికతో పాటు సంవత్సరాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. రాత్రిపూట మ్యాచ్ జరిగితే పగలు పనులన్నీ ముగించుకొని కొన్నిగంటలైనా మ్యాచ్ చూసేందుకు అభిమానులు వస్తారు. అతి త్వరలోనే డే-నైట్ టెస్టు జరుగుతుందని ఆశిస్తున్నా" అని కుంబ్లే తెలిపాడు.