హైదరాబాద్: కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ విఫలం కావడం... మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులతో నాలుగో రోజు ప్రారంభించిన భారత్.. కోహ్లీ క్రీజులో ఉండటంతో విజయంపై ధీమాగా ఉంది.
అయితే, శనివారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్నైట్ ఆటగాడు దినేశ్ కార్తీక్(20) ఆదిలోనే పెవిలియన్ చేరగా, హాఫ్ సెంచరీ పూర్తి చేశాక మరో ఓవర్నైట్ ఆటగాడు, కోహ్లీ(51) ఎల్బీగా వెనుదిరగడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. దీంతో తొలి టెస్టులో గెలిచే సువర్ణావకాశాన్ని భారత్ కోల్పోయింది.
ముఖ్యంగా నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా వికెట్లు తీసి ఇంగ్లాండ్కు విజయాన్ని అందించాడు. అయితే, ఆతిథ్య ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో హాఫ్ సెంచరీ సాధించిన కుర్రాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.
భారత్ ఓటమికి ఐదు కారణాలు: