భరత్ అరుణ్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ "బ్యాట్స్మెన్, సహాయ సిబ్బంది, బ్యాటింగ్ కోచ్, హెడ్ కోచ్ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరు కోచ్లతో రవిశాస్త్రి చర్చిస్తూనే ఉంటారు. ఆటగాళ్ల ప్రదర్శనపై మేం చర్చిస్తామో చెప్పను" అని అన్నాడు.
ఎలా మెరుగు అవ్వాలన్నదానిపై
"మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మాత్రం, అవును ఇంకా ఎలా మెరుగు అవ్వాలన్న దానిపై బ్యాట్స్మెన్ అందరితోనూ శాస్త్రి మాట్లాడతారు" అని అన్నాడు. ఇక, ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ధోని పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశాడని భరత్ అరుణ్ పేర్కొన్నాడు.
నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా
"పరిస్థితులు, వికెట్ను పరిగణనలోకి తీసుకుంటే మేం నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నాం. ధోనీ-జాదవ్ బ్యాటింగ్ చేస్తున్న దశలో మేం వికెట్ చేజార్చుకొని ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. అందుకే ధోనీ బ్యాటింగ్పై ఆందోళన చెందడం సరికాదు" అని భరత్ అరుణ్ తెలిపాడు.
విండిస్తో మ్యాచ్లో పేసర్లు రాణిస్తారు
"ఇక వెస్టిండిస్తో మ్యాచ్లో మా పేసర్లు రాణిస్తారన్న నమ్మకం ఉంది. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు అదనపు బలాలున్నాయి. అవి మా బౌలర్లకు సవాల్గా నిలుస్తాయి. అయితే కరీబియన్లను ఎక్కువ సమయం క్రీజులో నిలవకుండా మా బౌలర్లు అడ్డుకుంటారు" అని అరుణ్ తెలిపాడు.