న్యూఢిల్లీ: 24 సెప్టెంబర్ 2007. భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రపంచ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలుపు రెండు దేశాలకు ఎంతో కీలకం. టీ20 ఫార్మాట్లో అదే తొలి ప్రపంచకప్ టోర్నమెంట్. ఈ మ్యాచ్లో ధోనీ సారథ్యంలో భారత్.. పాక్పై విజయం సాధించింది.
అప్పుడు భారత్ టైటిల్ గెలిచింది. ముఖ్య విషయం ఏమంటే ఆ సమయంలో ఇండియాకు కోచ్ ఎవరూ లేరు. మేనేజర్ లాల్ చంద్ రాజ్పుత్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్ కోసం వెళ్లింది. కోచ్ లేకుండానే మిగతా జట్లను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.
ఐపీఎల్లో సత్తా చాటి వరల్డ్కప్ జట్టులో చోటు సంపాదిస్తా: రహానే
అంతకుముందు, ఆరు నెలల పాటు టీమిండియా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వన్డే ప్రపంచకప్లో ఇండియా నిరాశపరిచింది. మార్చి 23న జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలి రౌండులోనే ఇంటి ముఖం పట్టింది. ఆ తర్వాత టీమిండియా కోచ్గా ఉన్న గ్రెగ్ చాపెల్ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఆరు నెలల పాటు కోచ్ లేకుండా సాగింది.
కోచ్ లేకుండానే తొలి టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నెగ్గింది. ఆ ఇది నెగ్గిన కొద్ది నెలలకు సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టన్ను టీమిండియా కోచ్గా నియమించింది.