కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా
మొత్తం 28 మంది సభ్యులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా అందులో పది మందితో కూడిన తుది జాబితాను ఎంపిక చేసి, వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. మాజీ ఆటగాడు డబ్ల్యూవీ రామన్ను కోచ్గా నియమించింది మాజీ క్రికెట్ దగిగ్జం కపిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.
రమేశ్ పొవార్ కూడా ఇంటర్వ్యూకు
వీరిలో రమేశ్ పొవార్ కూడా ఇంటర్వ్యూకు వచ్చినప్పటికీ అతను ఎంపిక కాకపోవడం ఎడుల్జీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమె వినోద్ రాయ్ను లక్ష్యంగా చేసుకుని ఈ-మెయిల్ పంపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో వరల్డ్ టీ20 సెమీస్ నుంచి మిథాలీ రాజ్ తప్పించిన దానికి సంబంధించిన వివాదాన్ని ఉపయోగించుకుని తనను దెబ్బ తీసేందుకు రాయ్ ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.
జోహ్రీని తిరిగి బీసీసీఐ సీఈఓగా
దీంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ జోహ్రీని తిరిగి బీసీసీఐ సీఈఓగా బాధ్యతలు అందుకోకూడదని ఎడుల్జీ పట్టుబట్టింది. రాహుల్ జోహ్రీపై వచ్చిన ఆరోపణలకు బీసీసీఐ ఓ విచారణ కమిటీని ఆదేశించింది. ఈ కమిటీ జోహ్రీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో అతడు తిరిగి సీఈఓగా నియమితుడయ్యాడు.
తీవ్రంగా వ్యతిరేకించిన డయానా ఎడుల్జీ
దీనిని డయానా ఎడుల్జీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే మిథాలీ రాజ్ని తప్పించడంలో తన పాత్ర ఉందంటూ గొడవను పెద్దది చేశారని రాయ్కు పంపిన మెయిల్లో ఎడుల్జీ మండిపడ్డారు. ఈ మెయిల్ను ఆమె బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరికి కూడా పంపడం విశేషం. వీరిద్దరి అంతర్గత పోరు ఇప్పుడు బీసీసీఐలో చర్చనీయాంశంగా మారింది.