హైదరాబాద్: విజయ్ హాజరే ట్రోఫీతో పాటు.. దేవధర్ ట్రోఫీ కూడా కైవసం చేసుకోవాలనుకున్న కర్ణాటకకు నిరాశే ఎదురైంది. దేవధర్ ట్రోఫీ సాంతం తన అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టుని ఫైనల్ చేర్చిన రవికుమార్ సమర్థ్ మరోసారి సెంచరీతో మెరిసినా కర్ణాటకకు విజయాన్ని అందించలేకపోయాడు.
గురువారం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ 'బి'తో జరిగిన ఫైనల్లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటకకు శుభారంభం దక్కలేదు. ఈ ఏడాది దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్ (14), కరుణ్ నాయర్ (10) త్వరగానే ఔటయ్యారు.
India B celebrate their six-wicket win over Karnataka after clinching the @paytm #DeodharTrophy 2017-18 in Dharamsala pic.twitter.com/7KRoFS02WA
— BCCI Domestic (@BCCIdomestic) March 8, 2018
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవికుమార్ సమర్థ్ (107) సీఎం గౌతమ్ (76) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. వీరిద్దరు ఐదో వికెట్కు 132 పరుగులు జోడించారు. అనంతరం 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-బి 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్లు గైక్వాడ్ (58), ఈశ్వరన్ (69)లతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (61; 7 ఫోర్లు), మనోజ్ తివారి (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును విజయపథంలో నడిపించారు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.
Brief scores: Karnataka: 279/8 (Ravikumar Samarth 107, C M Gautam 76; K Khaleel Ahmed 3/49) lost to India B: 281/4 (Shreyas Iyer 61, Abhimanyu Easwaran 69, Manoj Tiwary 59 not out; Shreyas Gopal 2/55).