ధోనీని అధిగమించాడు:
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హిట్ మ్యాన్ మూడు సిక్స్లు బాదాడు. దీంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ మ్యాచ్కు ముందువరకు అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) భారత్ తరఫున అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా ధోనీ (355) ఉన్నాడు. పాక్తో మ్యాచ్లో హిట్మ్యాన్ (358) మూడు సిక్సర్లు బాది ధోనీ రికార్డును అధిగమించాడు.
మూడో స్థానంలో సచిన్:
అత్యధిక సిక్స్లు సాధించిన భారత బ్యాట్స్మెన్ల జాబితాలో రోహిత్, ధోనీ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సచిన్ టెండూల్కర్ (264), యువరాజ్ సింగ్ (251), సౌరవ్ గంగూలీ (247), వీరేంద్ర సెహ్వాగ్ (243)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ డకౌట్ అయ్యాడు. ఇద్దరి మధ్య కేవలం మూడు సిక్స్లు మాత్రమే అంతరం ఉండడంతో.. ధోనీ మళ్లీ రోహిత్ను అధిగమించే అవకాశం ఉంది.
ఈ ప్రపంచకప్లో రెండో సెంచరీ:
ఈ సెంచరీ రోహిత్కు వన్డే కెరీర్లో 24వది. ఈ ప్రపంచకప్లో రెండో సెంచరీ. టోర్నీ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ తొలి సెంచరీ అందుకున్నాడు. అయితే ఈ సెంచరీ రోహిత్కు ఓవరాల్ ప్రపంచకప్లో మూడో సెంచరీ. తొలి శతకం 2015 ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై చేసాడు. ఇక ప్రపంచకప్లో పాకిస్తాన్పై రెండో సెంచరీ. దీంతో ప్రపంచకప్లో పాకిస్తాన్పై రెండు సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు.
203 ఇన్నింగ్లలోనే 24 సెంచరీలు:
ఇక 203 ఇన్నింగ్లలోనే రోహిత్ 24 సెంచరీలు అందుకున్నాడు. దీంతో అతి తక్కువ ఇన్నింగ్లలో 24 శతకాలు అందుకున్న నాలుగో బ్యాట్స్మెన్గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. హాషీమ్ ఆమ్లా (142 ఇన్నింగ్లు), విరాట్ కోహ్లీ (161 ఇన్నింగ్లు), ఏబీ డివిలియర్స్ (192 ఇన్నింగ్లు) రోహిత్ కంటే ముందు ఉన్నారు.