4-0తో పాక్ సిరిస్ను చేజార్చుకోవడంపై
వరల్డ్కప్కు ముందు ఇంగ్లాండ్తో జరిగిన ఐదు వన్డేల సిరిస్ను 4-0తో పాకిస్థాన్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత జరిగిన మిగతా నాలుగు వన్డేల్లోనూ పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ సిరిస్ ఓటమికి గల కారణాలను అజహర్ మహ్మద్ విశ్లేషించాడు.
ఆతిథ్య జట్టుతో పోటీపడి పరుగులు
"వన్డే సిరిస్ను గమినిస్తే మేం ఆతిథ్య జట్టుతో పోటీపడి పరుగులు సాధించాం. మొత్తంగా సిరీస్ను కోల్పోయినా ఆ జట్టుకు మా జట్టుకు ఉన్న పరుగుల వ్యత్యాసం పెద్ద ఎక్కువేమీ కాదు. కేవలం మా ఫీల్డింగ్ పేలవంగా ఉండటంతో పాటు బౌలింగ్లో అదనపు బౌన్స్ రాకపోవడం వల్లే సిరీస్ కోల్పోయాం" అని తెలిపాడు.
విఫలం కావడానికి కారణమిదే
"మా బౌలింగ్ విఫలం కావడానికి అనుభవం లేని ఆటగాళ్లు జట్టులో ఉండటమే కారణం. ప్రస్తుతం ఉన్న జట్టు బౌలింగ్ విభాగానికి సంబంధించి సీనియర్ ఆటగాళ్లు వచ్చారు. పది వికెట్లు తీయడానికి పది మంచి బంతులు పడితే సరిపోతుంది" అని అజహర్ మహ్మద్ అన్నాడు. గత జూన్లో ఇంగ్లాండ్ 481 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
అత్యధిక స్కోరు ఇదే
వన్డే క్రికెట్లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. దీనిపై అజహర్ మహ్మద్ మాట్లాడుతూ "480 పరుగులు చేసిన పిచ్ వరల్డ్ రికార్డు పిచ్. ఈ రికార్డు సాధించడానికి ఇంగ్లాండ్ 300 బంతులను ఎదుర్కొంది. అయితే, ఇక్కడ 10 మంచి బంతులు చాలు 10 వికెట్లను తీయడానికి" అని అన్నాడు.
షార్ట్ పిచ్ బంతులను వేశాం
"పాక్ ఆడిన గత మ్యాచ్ని చూస్తే ఎక్కువగా షార్ట్ బంతులను వేయడం జరిగింది. ఈ మ్యాచ్లో కూడా అదే చేస్తాం. ప్రస్తుతం జట్టులో 140 స్పీడ్తో బౌలింగ్ చేయగలిగిన బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో కూడా మా బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తారు" అని అజహర్ మహ్మద్ తెలిపాడు.