
హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా లార్డ్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో బాబర్ అజాం 99 బంతుల్లో 96(11 ఫోర్లు) చేసి మొహమ్మద్ సైపుద్దీన్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. దీంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తద్వారా ఒక ప్రపంచకప్లో పాకిస్థాన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్ 437 పరుగుల రికార్డుని అధిగమించాడు. 1992 ప్రపంచకప్లో జావేద్ మియాందాద్ ఈ పరుగులు సాధించాడు.
ఈ ప్రపంచకప్లో బాబర్ ఆజాం అద్భుతమైన ఫామ్ను కనబర్చాడు. మొత్తం 8 మ్యాచ్లు ఆడిన బాబర్ ఆజాం 474 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 101 నాటౌట్. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.
క్రీజులో ఇమామ్ ఉల్ హాక్(79), మహ్మద్ హఫీజ్(8) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు స్కోరు 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సైఫుద్దీన్ వేసిన ఎనిమిదో ఓవర్లో పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్(13) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంలో ఫకార్ జమాన్ విఫలమయ్యాడు.