మొదటి రెండు టీ20లకు గేల్ దూరం
ఈ నేపథ్యంలో మొదటి రెండు టీ20లకు తాను అందుబాటులో ఉండనని క్రిస్ గేల్ ముందుగానే బోర్డుతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు వెస్టిండిస్ బోర్డు ప్రకటించిన 14 మంది జట్టు సభ్యుల్లో సునీల్ నరేన్, కీరన్ పొలార్డ్లు చోటు దక్కించుకున్నారు. చివరగా సునీల్ నరేన్ విండిస్ తరుపున టీ20ల్లో సెప్టెంబర్, 2017న ఆడాడు.
రెండేళ్ల తర్వాత జట్టులోకి సునీల్ నరేన్
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్కు సైతం సునీల్ నరేన్ ఎంపికవ్వలేదు. కాగా, ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున సునీల్ నరేన్ 10 వికెట్లతో ఫరవాలేదనిపించాడు. ఇక, పొలార్డ్ విషయానికి వస్తే గత రెండేళ్లుగా విండిస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేదు.
పొలార్డ్ మెరుపులు
అయితే, టీ20ల్లో మాత్రం వెస్టిండిస్ తరుపున నిలకడగా ఆడుతున్నాడు. చివరిగా గతేడాది నవంబర్, 2018న వెస్టిండిస్ జట్టు తరుపున పొలార్డ్ టీ20 ఆడాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్లో వెస్టిండిస్ బోర్డు పలువురు యువ ఆటగాళ్లకు సైతం చోటు కల్పించింది.
యువ క్రికెటర్లకు చోటు
వెస్టిండిస్ తరుపున 12 టీ20 మ్యాచ్లాడి... 46 లిస్ట్-ఏ గేమ్లు ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఆంటోనీ బ్రామబోలే సైతం ఈ పర్యటనకు ఎంపికయ్యాడు. 28 ఏళ్ల ఆంటోనీ బ్రామబోలే వెస్టిండిస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడని ఆంటోనీ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.