న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చతేశ్వర్ పుజారా దుమ్మురేపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. రాయల్ లండన్ వన్డే కప్లో సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వార్విక్షైర్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పుజారా ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. సాధారణంగా నిదానంగా ఆడే పుజారా.. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఒక్కోసారి బౌలర్లను విసగిస్తూ వారి సహనానికి పరీక్షగా నిలుస్తాడు. 50 బంతులు ఆడి ఒక్క పరుగు చేయని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
అలాంటి పుజారా ఉగ్రరూపం కనబర్చాడు. 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్లో సస్సెక్స్ 311 పరుగుల లక్ష్య ఛేదనలో 112 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పుజారా 22వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
4 2 4 2 6 4
— Sussex Cricket (@SussexCCC) August 12, 2022
TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI
ఎప్పుడూ నిదానంగా ఆడే పుజారా ఇలా ధాటిగా ఆడటం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరం క్రికెట్లో దూకుడుగా ఆడకుంటే మనుగడ లేదనే విషయాన్ని పుజారా గ్రహించే తన ఆటను అప్ డేట్ చేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.