India: బంగ్లాదేశ్ పర్యటనకు వన్డే, టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టీమ్లోకి రాహుల్ త్రిపాఠీ, రజత్ పాటిదారు

బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే, టెస్ట్ జట్టును సెలక్టర్లు ఒకేసారి సెలక్ట్ చేశారు. భారత జట్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వచ్చాడు. మోకాలి గాయంతో శస్త్రచికిత్స చేయాల్సిన జడేజా టీ20 ప్రపంచకప్కు దూరమయ్యాడు. భారత్ బంగ్లా టూర్ డిసెంబరు 4న వన్డే సిరీస్తో ప్రారంభమై డిసెంబర్ 26న రెండో టెస్టుతో ముగుస్తుంది. జడేజా వన్డే, టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

హార్దిక్ పాండ్యా
మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచకప్ తర్వాత భారత్ న్యూజిలాండ్ పర్యటిస్తుంది.ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ విశ్రాంతి ఇచ్చారు. వారిద్దరూ బంగ్లాదేశ్ పర్యటనకు తిరిగి జట్టులోకి వచ్చారు. వెన్ను గాయం కారణంగా టీ20 ప్రపంచకప్కు దూరమైన దీపక్ చాహర్ కూడా జట్టులోకి వచ్చాడు. రజత్ పాటిదారు, రాహుల్ త్రిపాఠీ కూడా జట్టులోకి వచ్చారు.

వన్డే జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదారు, శ్రేయస్స్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షర్దుల్ ఠాగూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యాష్ దయాల్.

టెస్ట్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర పుజరా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భారత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షర్దుల్ ఠాగూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications