హైదరాబాద్: రెండు బంతులకు ఆరు పరుగులు. అందరిలో ఉత్కంఠ. క్రీజులో బ్యాటింగ్కు సిద్ధంగా మొహమ్మదుల్లా ఉన్నాడు. శ్రీలంక బౌలర్ వేసిన బంతిని సిక్సు షాట్ కొట్టి బౌండరీకి పంపించాడు మొహమ్మదుల్లా. దీంతో మ్యాచ్ ముగిసింది. కానీ వివాదం అక్కడే మొదలైంది. నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం నెలకొన్న తీవ్ర పరిణామాలపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ దేశ ఆటగాళ్లే తప్పు చేశారంటూ క్షమాపణలు తెలియజేసింది.
ఈ మేరకు బీసీబీ.. శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. 'మా ఆటగాళ్ల వ్యవహార శైలి మూలంగానే విధ్వంసకాండ జరిగింది. ఇతరులను రెచ్చగొట్టే విధంగా మైదానంలో ఆటగాళ్లు అలా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్థించబోరు. తప్పంతా మా వాళ్లదే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మా ఆటగాళ్లు వ్యవహరించారు. అందుకు బీసీబీ క్షమాపణలు తెలియజేస్తోంది' అంటూ బీసీబీ పేర్కొంది.
Ok guys, things have been done and dusted
— Nibraz Ramzan (@Nibrazcricket) March 18, 2018
Just because one or two Bangladesh players played the fool two nights ago, we should not hate the entire nation, we should not forget how the majority of their fans stood with Srilanka in 2014 T20 WC Final.
Lets be with them Tonight pic.twitter.com/b7O7BvibpT
కాగా, మ్యాచ్ చివరి ఓవర్లో రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్మన్ అసహనానికి గురయ్యారు. బంగ్లా సబ్స్టిట్యూట్ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు.
Bangladesh are not only Shakib Al Hasan and the 'water boy'. Lest we forget a majority of Bangladeshis supported #SriLanka at the 2014 ICC World T20 Finals in Dhaka.#NidahasTrophy2018 pic.twitter.com/kvHS9T2EW3
— Ranjan Mellawa (@RMellawa) March 17, 2018
ఒక్క బంతి తేడాతో మ్యాచ్ గెలిచాక లంక ఆటగాళ్లను, ప్రేక్షకులను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేయగా.. అందుకు ప్రతిగా మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి.