భారత్ బౌలర్లు అద్భుతం
"ఆస్ట్రేలియా గడ్డపై గతంలో భారత్ బౌలర్లు ఎవరూ ఈ తరహాలో టెస్టుల్లో రాణించలేదు. ముఖ్యంగా భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. పిచ్ నుంచి పేస్ రాబడుతూనే, బంతిని రెండు వైపులా స్వింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో కూడా నిలవలేకపోయారు" అని అన్నాడు.
వికెట్లు పడుతున్నా
"ఇంకా చెప్పాలంటే వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు తప్ప.. ఓపికగా క్రీజులో నిలవాలనే ఆలోచనే వారికి లేకపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కూడా సొంతగడ్డపై తేలిపోయారు" అని కటిచ్ వెల్లడించాడు. ఈ సిరిస్లో భారత బ్యాట్స్మెన్ మొత్తం ఐదు సెంచరీలు నమోదు చేశారు.
ఆసీస్ నుంచి ఒక్క సెంచరీ కూడా లేదు
మరోవైపు ఆస్ట్రేలియా నుంచి ఒక్క బ్యాట్స్మన్ కూడా సెంచరీ సాధించలేకపోయాడు. సిరీస్లో జరిగిన నాలుగు టెస్టుల్లో ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేసిన అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్ల్లో కలిపి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
టీమిండియా సమిష్టి ప్రదర్శన
ఈ సిరిస్లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. పుజారాతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 350 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 282 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఇక, బౌలింగ్లోనూ భారత్ ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ పేసర్ల కంటే మెరుగ్గా రాణించారు. మరోవైపు బుమ్రా 21 వికెట్లతో కెరీర్లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేయగా మిచెల్ స్టార్క్ 13 వికెట్లు మాత్రమే తీశాడు.