విశ్రాంతి తీసుకోవలసిన సమయం కాదు
ఈ క్రమంలో పాంటింగ్.. ఆస్ట్రేలియా జట్టుతో 'ఇది విశ్రాంతి తీసుకోవలసిన సమయం కాదు. రెండో టెస్టులో గెలిచిన విధంగా బాక్సింగ్ టెస్టులోనూ రాణించాల్సి ఉంది. ఇప్పుడే మొదలైన ఆటతీరును కొనసాగించాలి. గెలిచింది ఒక్క మ్యాచే తర్వాతి మ్యాచ్లో రాణిస్తారా అనే సందేహమే లేదు. మెల్బౌర్న్ కచ్చితంగా గెలుస్తారనే నమ్మకముంది. పెర్త్లో చేసిందే మెల్బౌర్న్లోనూ చేయాలి.
ఆసీస్ గడ్డపై గెలిచిన దాఖలాల్లేవ్
ఆస్ట్రేలియా జట్టు గెలవాలని సూచించిన పాంటింగ్.. భారత్ కూడా రాణించే అవకాశాలన్నాయని వెల్లడించాడు. భారత్ మళ్లీ తన ఫామ్ను పుంజుకోవడానికి మూడు, నాలుగు టెస్టులు జరగనున్న మెల్బౌర్న్, సిడ్నీ స్టేడియంలు బాగా కలిసొస్తాయని తెలిపాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు విజయం భారత్ చేసిన ఆస్ట్రేలియా పర్యటనల్లో మొదటి విజయం. ఇప్పటి వరకూ ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో భారత్ గెలిచిన దాఖలాల్లేవు. ఇదిలా ఉంచితే పెర్త్ వేదికగా ఆసీస్ గెలిచిన టెస్టు మ్యాచ్ కెప్టెన్గా టిమ్ పైనె కెరీర్లో మొదటిది.
ఇంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు
శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.