మిర్పూర్: ఆసియా కప్లో మరో సంచలన విజయం కొద్దిలో తప్పిపోయింది. పసికూన యూఏఈ బలమైన పాకిస్థాన్ జట్టునుఓడించినంత పని చేసింది. సోమవారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ పాక్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై చెమటోడ్చి గెలిచి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
షైమన అన్వర్ (46) ఆదుకోవడంతో యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. మహ్మద్ ఆమెర్, మహ్మద్ ఇర్ఫాన చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్ 3 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షోయబ్ మాలిక్ (63 నాటౌట్), ఉమర్ అక్మల్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. జావెద్ 3 వికెట్లు తీశాడు.