హైఓల్టేజ్ మ్యాచ్గా భారత్-పాక్ మ్యాచ్
ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ని అభిమానులు హైఓల్టేజ్ మ్యాచ్గా అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్క్ లోడ్, రాబోయే ఉన్న సిరిస్లను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు ఈ టోర్నీ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.
కెప్టెన్గా రోహిత్ శర్మ
కోహ్లీ స్థానంలో కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన సెలక్టర్లు, వైస్ కెప్టెన్గా ఓపెన్ శిఖర్ ధావన్ను ఎంపిక చేశారు. ఈ ఆసియా కప్లో భారత్తో సహా మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. టాప్-2లో నిలిచిన రెండు జట్లు కూడా సూపర్-4 స్టేజికి అర్హత సాధిస్తాయి.
|
50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్
ఈసారి ఆసియా కప్ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక అయింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఇప్పటివరకు 13 సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. భారత జట్టు ఆరు సార్లు ఆసియా కప్ను ఎక్కువ సార్లు కైవసం చేసుకుంది.
ఆరు సార్లు టైటిల్ విజేతగా టీమిండియా
భారత్ ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలవగా, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఈ ట్రోఫీని నెగ్గాయి. బంగ్లాదేశ్ అత్యధికంగా ఐదు సార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 2014 వరకు జరిగిన ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్లో నిర్వహించేవారు. 2015 నుంచి ఈ టోర్నీని వన్డే, టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.