|
మైదానంలో కూప్పకూలిన హార్దిక్ పాండ్యా
కనీసం నిల్చునే పరిస్థితి కూడా లేకపోవడంతో పిచ్ పక్కనే పడిపోయాడు. క్రీజులో ఉన్న పాకిస్థాన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్, టీమిండియా సహచరులు వచ్చి కాస్త లేపే ప్రయత్నం చేసినా నొప్పి తీవ్రతకు కనీసం కదల్లేకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. అప్పటికే జట్టు ఫిజియో మైదానంలోకి చేరుకొని అతని గాయాన్ని పరిశీలించారు.
గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో
గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో స్ట్రెచర్ తీసుకువచ్చి వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. పాండ్యా వెళ్లిపోవడంతో అతని స్థానంలో 18వ ఓవర్ చివరి బంతికి అంబటి రాయుడు వేశాడు. హార్దిక్ పాండ్యాకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలిందని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.
పాండ్యా స్థానంలో దీపక్ చాహార్
ప్రస్తుతానికి అతను లేచి నిలబడగలిగే పరిస్థితుల్లో ఉన్నా.. మ్యాచ్ ఆడేంత ఫిట్నెస్ హార్ధిక్ పాండ్యాకు వైద్యులు లేదని తేల్చి చెప్పారు. ఆసియా కప్ టోర్నీ కోసం పాండ్యా స్థానంలో పేసర్ దీపక్ చాహర్ను జట్టులోకి ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. గురువారం అతడు జట్టుతో కలవనున్నాడు.
|
దుబాయిలో మండుతోన్న ఎండలు
ప్రస్తుతం దుబాయ్లో ఎండలు మండుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఎడారి ప్రాంతం దుబాయ్లో వేడికి ఆటగాళ్లు ఉడికిపోతున్నారు. దాదాపు 40 డిగ్రీలు దాటి ఎండ కాస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు. పరుగులు తీయాలన్నా శరీరంలోని నీరంతా ఆవిరైపోతోంది. పాకిస్థాన్తో మ్యాచ్కు ముందు టీమిండియా ఆటగాళ్లు సాధన చేశారు. ఎండకు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే చల్లని మంచినీటి సీసాలను మెడపై పెట్టుకున్నారు. కొందరేమో ఐస్ డబ్బాలో తలపెట్టేశారు. ఇంకొకరేమో టోపీలో మంచు గడ్డలు వేసుకొని తలకు పెట్టుకున్నారు.
అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా ఔట్
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత పనిచేసింది. వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ టోర్నీకి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరంగా.... తాజాగా స్పిన్నర్ అక్షర పటేల్, పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్లు సైతం గాయాలు కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. పాకిస్థాన్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో అక్షర పటేల్ చేతి వేలుకి తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. మరోవైపు గాయం కారణంగా టోర్నీకి దూరమైన శార్దూల్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ను ఎంపిక చేశారు.